AP: ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-08-04T18:02:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖలో ముగ్గురు ఆర్థికశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం

AP: ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వోలు డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లుని కూడా సస్పెండ్ చేసింది. ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారన్న అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ముగ్గురు హెడ్‌క్వార్టర్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.

Updated Date - 2021-08-04T18:02:11+05:30 IST