పార్లమెంట్ ముందు రాజ్యాంగ పీఠిక పఠించిన సస్పెండెడ్ ఎంపీలు

ABN , First Publish Date - 2021-12-22T21:26:39+05:30 IST

మంగళవారం చైర్మెన్ కుర్చీపైకి ఆర్డర్ బుక్ విసిరాన్న కారణంతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను సస్పెండ్ చేశారు. కాగా, మొత్తం 13 మంది ఎంపీలు బుధవారం మద్యాహ్నం పార్లమెంట్ ఆవరణలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యాంగ పీఠిక..

పార్లమెంట్ ముందు రాజ్యాంగ పీఠిక పఠించిన సస్పెండెడ్ ఎంపీలు

న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహం ముందు రాజ్యాంగ పీఠికతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. వర్షాకాల సమావేశాల్లో సభలో గందరగోళం సృష్టిస్తూ సభా మర్యాదలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని 12 మంది ఎంపీలపై శీతాకాల సమావేశాల తొలి రోజునే సస్పెన్షన్ విధించారు. కాగా తమ సస్పెన్షన్ సభా విధానాలకు విరుద్ధంగా ఉందంటూ పార్లమెంట్ ఆవరణంలో మూడు వారాలుగా ఎంపీలు నిరసన చేస్తున్నారు.


మంగళవారం చైర్మెన్ కుర్చీపైకి ఆర్డర్ బుక్ విసిరాన్న కారణంతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను సస్పెండ్ చేశారు. కాగా, మొత్తం 13 మంది ఎంపీలు బుధవారం మద్యాహ్నం పార్లమెంట్ ఆవరణలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యాంగ పీఠిక చదివి జాతీయ గీతాన్ని ఆలపించారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విలువల్ని, పార్లమెంట్ పద్దతుల్ని ఏమాత్రం పాటించట్లేదని సస్పెండె‌డ్ ఎంపీలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు కొనసాగాల్సి ఉండగా.. 22వ తేదీనాటికే ముగించారు.

Updated Date - 2021-12-22T21:26:39+05:30 IST