ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న 25ఏళ్ల యువకుడు.. రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు.. చివరికి తలలు పట్టుకున్న కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2022-01-06T23:03:23+05:30 IST

అతడికి 25ఏళ్లు. చదువు పూర్తైన తర్వాత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో అతడికి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. ఎప్పటిలాగే బుధవా

ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న 25ఏళ్ల యువకుడు.. రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు.. చివరికి తలలు పట్టుకున్న కుటుంబ సభ్యులు

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 25ఏళ్లు. చదువు పూర్తైన తర్వాత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో అతడికి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. ఎప్పటిలాగే బుధవారం కూడా డ్యూటీకి వెళ్లిన ఆ యువకుడు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత అనూహ్య ఘటన చోటు చేసుకోవడంతో అతడి కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన 25ఏళ్ల లాల్మన్ యాదవ్.. చండాపార్ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన.. బుధవారం ఉదయం కూడా డ్యూటీకి వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చాడు. అప్పటి  వరకూ ఇంట్లోనే ఉన్న లాల్మన్.. రాత్రి 9 గంటలకు బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారు. చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఓ ఫోన్‌కాల్ రావడంతో కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. 



గ్రామం చివర చెట్టుకు విగత జీవిగా లాల్మన్ వేలాడుతున్నట్టు తెలిసి హుటాహుటిన అక్కడకు వెళ్లారు. కాగా.. అప్పటికే అక్కడకు చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో లాల్మన్ సోదరుడు మాట్లాడుతూ.. రాత్రి 9 గంటల సమయంలో తన తమ్ముడికి ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని చెప్పాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తులే తన తమ్ముడిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు. 




Updated Date - 2022-01-06T23:03:23+05:30 IST