ఒకరి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-05-16T05:36:44+05:30 IST

మండలంలోని సోమవర ప్పాడు గ్రామంలోని ఒక రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్‌ల షెడ్డులో ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్టు దెందు లూరు పోలీసులు తెలిపారు.

ఒకరి అనుమానాస్పద మృతి
అశోక్‌ కుమార్‌ సింగ్‌ (ఫైల్‌)

దెందులూరు, మే 15: మండలంలోని సోమవర ప్పాడు గ్రామంలోని ఒక రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్‌ల షెడ్డులో ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్టు దెందు లూరు పోలీసులు తెలిపారు. శనివారం పశువుల కాపరుల సమాచారం మేరకు దెందులూరు ఎస్‌ఐ రామ్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో భార్యతో కలసి దిగిన ఫొటోతో పాటు ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఆధారంగా ఇతనికి 43 ఏళ్లు ఉంటాయని, రాజస్థాన్‌లోని బంగ్లానగర్‌కు చెందిన అశోక్‌ కుమార్‌ సింగ్‌గా గుర్తించారు.   ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 


Updated Date - 2021-05-16T05:36:44+05:30 IST