అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-03-01T05:37:29+05:30 IST
గొల్లవానితిప్ప రోడ్లో నివాసం ఉండే దేవకొండ కిశోర్ (43) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు టూటౌన్ ఎస్ఐ రాంబాబు తెలిపారు.
భీమవరం క్రైం, ఫిబ్రవరి 28: గొల్లవానితిప్ప రోడ్లో నివాసం ఉండే దేవకొండ కిశోర్ (43) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు టూటౌన్ ఎస్ఐ రాంబాబు తెలిపారు. కిశోర్ మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.