మద్యం మత్తులో యాసిడ్ తాగిన వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-08-09T05:54:28+05:30 IST
మద్యం మత్తులో యాసిడ్ తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వట్టికోడు
మన్సూరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో యాసిడ్ తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వట్టికోడు గ్రామానికి చెందిన పోలేని చిరంజీవి(32) కుటుంబంతో కలిసి ఎల్బీనగర్, గుంటి జంగయ్యనగర్ కాలనీలో ఉంటున్నాడు. పెయింటర్గా పని చేస్తున్న చిరంజీవి మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లి మద్యం తాగిన చిరంజీవి ఇంటికొచ్చేటప్పుడు వెంట యాసిడ్ బాటిల్ తీసుకొచ్చాడు. మద్యం మత్తులో యాసిడ్ తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.