సుశాంత్ పోస్టుమార్టం నివేదికలో కనిపించని సమయం: న్యాయవాది

ABN , First Publish Date - 2020-08-16T02:25:27+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం రిపోర్టులో అత్యంత కీలకమైన విషయం

సుశాంత్ పోస్టుమార్టం నివేదికలో కనిపించని సమయం: న్యాయవాది

ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం రిపోర్టులో అత్యంత కీలకమైన విషయం మిస్సయిందని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాశ్ సింగ్ పేర్కొన్నారు. ఆ సమయాన్ని బట్టే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక, సుశాంత్‌ను హత్య చేసిన తర్వాత వేలాడదీశారా? అనేది తెలుస్తుందని పేర్కొన్నారు. ముంబైలోని డాక్టర్ ఆర్ఎన్ కూపర్ మునిసిపల్ జనరల్ ఆసుపత్రిలో సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సుశాంత్ ఉరి వేసుకోవడం వల్ల ఉక్కిరిబిక్కిరై మరణించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో జూన్ 14న చనిపోయి కనిపించాడు.

Updated Date - 2020-08-16T02:25:27+05:30 IST