చేపల దాణా తయారీ కేంద్రాలపై పోలీసుల ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-12-19T00:27:34+05:30 IST

జిల్లాలో యథేచ్ఛగా కల్తీ చేపల దాణాను తయారీ చేస్తున్న కేంద్రాలపై సూర్యాపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు.

చేపల దాణా తయారీ కేంద్రాలపై పోలీసుల ఉక్కుపాదం

సూర్యాపేట: జిల్లాలో యథేచ్ఛగా కల్తీ చేపల దాణాను తయారీ చేస్తున్న కేంద్రాలపై సూర్యాపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాకు  ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. శనివారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఏక కాలంలో సూర్యాపేట, చివ్వేంల, కోదాడలలో నకిలీ దాణా తయారీ కేంద్రాలపై దాడులు చేశామన్నారు. చేపల దాణాలో తౌడు రూపంలో సున్నపు రాయి మిశ్రమంతో కల్తీకి పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారని చెప్పారు. నిందితుల నుంచి 66 క్వింటాల దాణా, 62 క్వింటాల సున్నపు రాయి మిశ్రమం, మూడు మినీ వ్యాన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

Updated Date - 2021-12-19T00:27:34+05:30 IST