సూర్యాపేటలో దారుణం.. ఉపసర్పంచ్పై కత్తులతో దాడి..
ABN , First Publish Date - 2020-05-06T16:08:15+05:30 IST
భూవివాదంలో ఉప సర్పంచ్పై మాజీ ఎంపీటీసీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కాల్వపల్లి తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని మఠంపల్లి మండలం కాల్వపల్లి తండాలో
సూర్యాపేట : భూవివాదంలో ఉప సర్పంచ్పై మాజీ ఎంపీటీసీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కాల్వపల్లి తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని మఠంపల్లి మండలం కాల్వపల్లి తండాలో భూ వివాదం విషయంలో ఉప సర్పంచ్ సక్కు నాయక్ ఇంటిపై మాజీ ఎంపీటీసీ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. సక్కు నాయక్పై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. దీంతో సక్కు నాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు.. సక్కు నాయక్ను హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.