సూర్యాపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని తగులబెట్టిన దుండగులు

ABN , First Publish Date - 2022-01-15T16:41:49+05:30 IST

సూర్యాపేట మండలం తాళ్ల కాంపాడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు.

సూర్యాపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని తగులబెట్టిన దుండగులు

సూర్యాపేట: సూర్యాపేట మండలం తాళ్ల కాంపాడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ ఘటనపై వైఎస్సార్టీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తగులబెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్‌టీపీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తీవ్రంగా ఖండించారు. గతంలోనూ వైఎస్సార్ విగ్రహాన్ని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-01-15T16:41:49+05:30 IST