మలేషియాలో సూర్యాపేట వాసి మృతి
ABN , First Publish Date - 2021-10-19T13:48:30+05:30 IST
సూర్యాపేటకు చెందిన ఓ యువకుడు మలేషియాలో మృతి చెందాడు.
సూర్యాపేట: సూర్యాపేటకు చెందిన ఓ యువకుడు మలేషియాలో మృతి చెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21)గా గుర్తించారు. రిశివర్ధన్ ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సోమవారం మృత్యువాతపడ్డాడు. షిప్పై నుంచి సముద్రంలో పడిపోవడంతో మృతి చెందినట్లు తల్లిదండ్రులకు మలేషియా అధికారులు ఫోన్లో సమాచారం అందించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.