Telangana: కోదాడ, హుజూర్‌నగర్‌లో 96 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-01-15T19:18:11+05:30 IST

కోదాడ, హుజూర్‌నగర్ పట్టణాల్లో ఆంధ్రా నుండి తరలిస్తున్న 96 కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు.

Telangana: కోదాడ, హుజూర్‌నగర్‌లో 96 కిలోల గంజాయి పట్టివేత

సూర్యాపేట: కోదాడ, హుజూర్‌నగర్ పట్టణాల్లో ఆంధ్రా నుండి తరలిస్తున్న 96 కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. కోదాడ బస్టాండ్‌లో మహరాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తుల నుండి 57 కిలోల గంజాయిని  కోదాడ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హుజూర్‌నగర్ బస్టాండులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తుల నుండి 39 కిలోల గంజాయిని హుజూర్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. మహరాష్ట్రకు చెందిన ముగ్గురు, ఉత్తరప్రదేశ్ చెందిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 96 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-01-15T19:18:11+05:30 IST