స్టాక్ మార్కెట్‌లో దేదీప్యమానంగా వెలిగిన సూర్య రోష్ని.. 14% లాభపడిన స్టాక్

ABN , First Publish Date - 2022-08-26T19:52:14+05:30 IST

స్టాక్ మార్కెట్‌(Stock Market)లో సూర్య రోష్ని షేర్లు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. భారీ వాల్యూమ్‌ల నేపథ్యంలో

స్టాక్ మార్కెట్‌లో దేదీప్యమానంగా వెలిగిన సూర్య రోష్ని.. 14% లాభపడిన స్టాక్

Surya Roshni : స్టాక్ మార్కెట్‌(Stock Market)లో సూర్య రోష్ని షేర్లు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. భారీ వాల్యూమ్‌ల నేపథ్యంలో శుక్రవారం ఇంట్రా-డే(Intra Day)లో సూర్య రోష్ని షేర్లు(Surya Roshni Shares) బీఎస్‌ఈ(BSE)లో 14 శాతం పెరిగి రూ.433.35కి చేరాయి. నేటి ఉదయం స్టాక్ 12 శాతం లాభంతో రూ. 426.35 వద్ద స్టాక్ ట్రేడ్ అయింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ(S&P BSE) సెన్సెక్స్‌లో 0.77 శాతం పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈ(NSE), బీఎస్‌ఈలలో 810,000 ఈక్విటీ షేర్లు చేతులు మారడంతో కౌంటర్‌లో సగటు ట్రేడింగ్ వాల్యూమ్‌లు రెండింతలు పెరిగాయి.


ఇన్‌పుట్ కాస్ట్(Input cost) పెరగడంతో నిరాశాజనకమైన కార్యాచరణ పనితీరు కారణంగా, గత ఒక సంవత్సరంలో సూర్య రోష్ని మార్కెట్(Surya Roshni Market) 15 శాతం క్షీణించింది. సెన్సెక్స్‌ 6 శాతం పెరిగింది. ఈ స్టాక్ అక్టోబర్ 4, 2021న రికార్డు స్థాయిలో రూ.868కి చేరుకుంది. ఆగస్టు 16, 2022న 52 వారాల కనిష్ట స్థాయి రూ.336కి చేరుకుంది. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్(Aatma Nirbhar Bharat Abhiyaan)', 'వోకల్ ఫర్ లోకల్(Vocal for Local)', ఎల్‌ఈడీ లైటింగ్(LED lighting) ఉత్పత్తులు / విడిభాగాల కోసం PLI స్కీమ్‌లపై ప్రభుత్వం అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తుండటంతో వ్యవసాయం(agriculture), మ్యానిఫ్యాక్చరింగ్, ఎగుమతుల(Exports)కు గ్రామీణ భారతదేశం నుంచి భవిష్యత్తులో అధిక డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు.



Updated Date - 2022-08-26T19:52:14+05:30 IST