బృందావన్ కాలనీలో ఇంటింటా సర్వే
ABN , First Publish Date - 2020-04-04T10:13:39+05:30 IST
కరోనా పాటిజివ్ కేసును గుర్తించిన జహీరాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో శుక్రవారం అధికారులు ఇంటింటా సర్వే
జహీరాబాద్, ఎప్రిల్ 3 : కరోనా పాటిజివ్ కేసును గుర్తించిన జహీరాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో శుక్రవారం అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించారు. కరోనా బాధితుడు ఎవరెవరిని కలిశాడో వివరాలు సేకరించారు. బాధితుడి ఇంట్లో పని మనిషి కుటుంబ సభ్యులు ఐదుగురిని క్వారంటైన్కు తరలించారు. కాలనీలో రసాయనాలు పిచికారి చేశారు.