చీపురుపట్టిన సర్పంచ్
ABN , First Publish Date - 2021-05-17T04:41:24+05:30 IST
కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగు కోసం కార్మికులతోపాటు ఓ సర్పంచి చీపురు పట్టారు.
15 రోజులుగా వీధుల పరిశుభ్రత
దొరవారిసత్రం, మే 16 : కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగు కోసం కార్మికులతోపాటు ఓ సర్పంచి చీపురు పట్టారు. 15 రోజులుగా ఆ గ్రామంలోని వీధి వీధిని పరిశుభ్ర పరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మండలంలోని ఏకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందిన ఆవుల బ్లెస్సీ కరోనా కట్టడికి తన వంతుగా పారిశుధ్యం పనులను దగ్గరుండి చేయిస్తూ తనూ చేస్తున్నారు. వీధులను శుభ్రం చేయడం, సోడియం హైపో క్లోరైట్ను పిచికారీ చేయించడం, బ్లీచింగ్ వంటి చల్లించడం చేయిస్తున్నారు. అలాగే కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యపరుస్తున్నారు