రైనా రూ. 52 లక్షలు

ABN , First Publish Date - 2020-03-29T09:56:44+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత క్రీడాకారులు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు విరాళం అందజేయగా..

రైనా రూ. 52 లక్షలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత క్రీడాకారులు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు విరాళం అందజేయగా.. తాజాగా టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఏకంగా రూ. 52 లక్షల భారీ మొత్తాన్ని ప్రకటించాడు. ఈ మొత్తంలో రూ. 31 లక్షలు ప్రధానమంత్రి సహాయ నిధికి, మిగతా రూ. 21 లక్షలను సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి విపత్తు సంక్షేమ నిధికి అందజేస్తానని రైనా ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనేందుకు భారత క్రీడాకారుల్లో అత్యధిక మొత్తం విరాళాన్ని ప్రకటించింది రైనానే కావడం విశేషం. కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ ‘మోహన్‌ బగాన్‌’ కరోనా నివారణకు గాను రూ.20 లక్షల విరాళం ప్రకటించింది. 

Updated Date - 2020-03-29T09:56:44+05:30 IST