సురేష్ బాబుకు మళ్లీ ఆర్జేసీ పోస్టు
ABN , First Publish Date - 2021-05-18T16:07:09+05:30 IST
వివాదాల నేపథ్యంలో..
అమరావతి(ఆంధ్రజ్యోతి): వివాదాల నేపథ్యంలో దుర్గగుడి ఈవో బాధ్యతల నుంచి తప్పించిన దేవదాయశాఖ అధికారి సురే్షబాబును ప్రభుత్వం మల్టీజోన్- 1 ఆర్జేసీగా తిరిగి నియమించింది. దాదాపు నెల కిందట ఆయన్ను దుర్గగుడి ఈవో బాధ్యతల నుంచి తప్పించిన వెంటనే ప్రభుత్వం మల్టీజోన్-1 ఆర్జేసీగా నియమించింది. కానీ ఆయనపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నందున వెంటనే ఆ నియమకాన్ని ఉపసంహరించుకుని ఆర్జేసీ బాధ్యతలను అన్నవరం ఈవోకు అప్పగించింది. మళ్లీ ఇప్పుడు అదే పోస్టుకు ఆయన్ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.