ప్రేయసిని దారుణంగా చంపి.. ముక్కలుగా చేసి గుర్తుపట్టకుండా ముఖంపై చర్మం వలిచిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-09-08T02:52:01+05:30 IST
వారు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఆ యువతి తన ప్రియుడి వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అతడేమో ఆమెను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో.. అత్యాచారం కేసు పెడతానంటూ అతడిని ఆమె హెచ్చరించింది. ఆ తరువాత ఊహించిన ఘోరం జరిగిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: వారు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ యువతి తన ప్రియుడి వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అతడేమో ఆమెను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో.. అత్యాచారం కేసు పెడతానంటూ అతడిని ఆమె హెచ్చరించింది. ఆ తరువాత ఊహించిన ఘోరం జరిగిపోయింది. అత్యంత క్రూరమైన రీతిలో ఆమె మరణించింది. యువతి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఆగస్టు 27న మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఇటీవలే ఛేదించారు.
బిహార్కు చెందిన సితా భగత్, సూరత్(గుజరాత్) వాస్తవ్యుడైన వినయ్ కుమార్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోకుపోతే అత్యాచారం కేసు పెడతానంటూ ఇటీవల ఆమె బెదిరించడంతో వినయ్ ఆమెను అంతమొందించేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సీతను ఇటీవల సూరత్కు రప్పించాడు. అక్కడి నుంచీ ఇద్దరూ ఆగస్టు 27న నందూర్బార్ ప్రాంతానికి వెళ్లారు.
ఇవీ చదవండి:
ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం.. ఏడేళ్ల తర్వాత సిటీలో ఉంటున్న ఆమె గురించి షాకింగ్ నిజాలు..!
ఈ మహిళకు రూ. 1.8 కోట్ల పరిహారం.. ప్రతి మహిళా ఉద్యోగి తెలుసుకోవాల్సిన ఈమె కథేంటంటే..
అక్కడ వినయ్ ఆమెను ఎవరు లేని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత..మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖంపై ఉన్న చర్మాన్ని చెక్కెసి.. శరీరం నుంచి కాళ్లూ చేతులూ వేరు చేసి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. అయితే.. సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. సీతకు గతంలో మరో వ్యక్తితో ఎఫైర్ ఉండేదని, అతడిపై ఆమె అత్యాచారం కేసు పెట్టిందని వినయ్ కుమార్ పోలీసులకు తెలిపాడు.