లాయర్ల సమ్మెపై బీసీఐ సూచనలు కోరిన సుప్రీం

ABN , First Publish Date - 2021-07-27T07:18:48+05:30 IST

న్యాయవాదులు సమ్మె చేయడం, విధులకు దూరంగా ఉండడానికి సంబంధించిన

లాయర్ల సమ్మెపై బీసీఐ సూచనలు కోరిన సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 26: న్యాయవాదులు సమ్మె చేయడం, విధులకు దూరంగా ఉండడానికి సంబంధించిన కేసులో తమకు సాయం అందించాల్సిందిగా సుప్రీంకోర్టు భారత బార్‌ కౌన్సిల్‌(బీసీఐ) చైర్‌పర్సన్‌ను కోరింది. ఉత్తరాఖండ్‌లోని అనేక జిల్లాల్లో న్యాయవాదులు శనివారం విధులను బహిష్కరించడానికి సంబంధించిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు నిరుడు ఫిబ్రవరి 28న తీర్పు ఇచ్చింది. న్యాయవాదులు విధులకు దూరంగా ఉండడానికి సంబంధించిన అంశంపై తమకు నిర్మాణాత్మక సూచనలివ్వాల్సిందిగా ద్విసభ్య ధర్మాసనం సోమవారం బీసీఐ చైర్‌పర్సన్‌ ఎంకే మిశ్రాను కోరింది. 

Updated Date - 2021-07-27T07:18:48+05:30 IST