రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-01-27T18:39:46+05:30 IST

ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ పరిధిలోకి రాదంటూ

రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ: ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో కేసు విచారణ ఏ దశలో ఉందనే దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని.. రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.


Updated Date - 2022-01-27T18:39:46+05:30 IST