ఇంటర్ ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-06-24T19:41:34+05:30 IST

జులై 31 లోగా ఇంటర్​ ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెస్మెంట్ కోసం 10 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో పరీక్షల రద్దయ్యాయి

ఇంటర్ ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ: జులై 31 లోగా ఇంటర్​ ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెస్మెంట్ కోసం 10 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో పరీక్షల రద్దయ్యాయి. కాగా.. ఈ నెల మొదటి వారంలో విద్యార్థుల మార్కులకు సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాల్సిందిగా సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈలను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డుల మాదిరే సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ కూడా జులై 31లోగా ఫలితాలను వెల్లడించాలని పేర్కొంది. గత వారమే రెండు బోర్డులు కూడా మార్కులు వేసే విధానాన్ని కోర్టుకు సమర్పించాయి. ఆ అఫిడవిట్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. వ్యతిరేకించేందుకు ఆ విధానాల్లో లోపాలేవీ లేవని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించాలన్న కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఇప్పటిదాకా 21 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా.. ఆరు రాష్ట్రాల్లో నిర్వహించారు.


Updated Date - 2021-06-24T19:41:34+05:30 IST