లఖింపూర్ హింస: యూపీ సర్కార్‌కు చర్యలపై సుప్రీం అసంతృప్తి

ABN , First Publish Date - 2021-10-08T19:25:27+05:30 IST

లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి ..

లఖింపూర్ హింస: యూపీ సర్కార్‌కు చర్యలపై సుప్రీం అసంతృప్తి

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని సీజేఐ ఎస్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది. లఖింపూర్ హింసాత్మక ఘటనపై వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.


కాగా, మృతుల శరీరంలో బుల్లెట్లు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలిందని యూపీ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ కౌన్సిల్ హరీష్ స్వాలే కోర్టుకు విన్నవించారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆశిష్ మిశ్రా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్టు హరీష్ స్వాలే తెలిపారు. ఆశిష్ మిశ్రాను విచారించిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, దోషులను వదిలేది లేదని, కచ్చితంగా సంతృప్తికరమైన చర్యలే తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కోర్టుకు విన్నవించారు. హరీష్ సాల్వే హామీలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేస్తూ, స్థాయీ నివేదక సమర్పించాలని ఆదేశించింది. సాక్ష్యాలు తారుమారు కాకుండా పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని యూపీ పోలీస్ ఉన్నతాధికారులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2021-10-08T19:25:27+05:30 IST