Supreme Notices: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2022-08-11T18:02:55+05:30 IST

జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme Notices: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: జగన్ ప్రభుత్వాని (Jagan government)కి సుప్రీం కోర్టు (Supreme court) నోటీసులు జారీ చేసింది. మధ్యవర్తిత్వం కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ (Norman and Poster Company) పిటిషన్ వేయగా... సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. టీడీపీ (TDP) హయాంలో అమరావతి నిర్మాణం కోసం పోస్టర్ కంపెనీ డిజైన్లు సిద్ధం చేసింది. అయితే అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని  జగన్‌ పక్కన పెట్టారు. దీంతో తమకు రావాల్సిన నిధుల కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ నోటీసులు ఇవ్వగా... పోస్టర్ కంపెనీ నోటీసులను  జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

Updated Date - 2022-08-11T18:02:55+05:30 IST