శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
ABN , First Publish Date - 2021-12-27T02:24:20+05:30 IST
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్, వినీత్ సరన్ ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్, వినీత్ సరన్ ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వదించారు. శ్రీవారి లడ్డూప్రసాదాలను, కాఫీ టేబుల్ బుక్ను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అందజేశారు. అలాగే ప్రముఖ సినీనటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్, రాజస్థాన్ మంత్రి శకుంతల రావత్ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.