శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-11-06T01:03:21+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీసుధా కూడా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-11-06T01:03:21+05:30 IST