హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2021-09-16T17:58:09+05:30 IST

హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వెంటనే చెత్తనంతా క్లియర్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వానికి చివరి సారి అవకాశం ఇస్తున్నామని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ప్లాస్టర్‌ ఆఫ్ ప్యారిస్‌ విగ్రహాల నిమజ్జనానికి ఇదేచివరి అవకాశమన్నారు. నిమజ్జనానికి ఆధునిక క్రేన్లు వినియోగించాలన్నారు. హుస్సేన్ సాగర్‌ను ఒకప్పుడు మంచినీటి కోసం వాడే వారన్నారు. సాగర్ ఆధునీకరణకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది నిమజ్జనం పేరిట దాన్ని కాలుష్యం చేస్తే ప్రజాధనం వృథా అయినట్టు కాదా అని సీజేఐ ప్రశ్నించారు.

Updated Date - 2021-09-16T17:58:09+05:30 IST