సుప్రీం కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఊరట
ABN , First Publish Date - 2022-08-22T18:27:57+05:30 IST
ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
ఢిల్లీ (Delhi): ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama)కు సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్ (Bharath), వ్యక్తిగత సిబ్బందిపై హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసిన కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకూ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది.