నేడు మదనపల్లెకు సుప్రీం సీజే
ABN , First Publish Date - 2021-04-17T09:40:36+05:30 IST
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం చిత్తూరు జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 16: సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం చిత్తూరు జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం మదనపల్లెకు ఆయన చేరుకుంటారని, రాత్రికి అక్కడే బస చేస్తారని తెలిపారు. ఆదివారం మదనపల్లె నుంచి బయల్దేరి బెంగళూరుకు వెళతారని తెలిపారు.