సుప్రీం తీర్పు ఓ చెంపపెట్టు
ABN , First Publish Date - 2021-01-27T03:08:38+05:30 IST
పంచాయతీ ఎన్నికలను అడ్డుకునే వారికి సుప్రీంకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అని టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్ర
కొడవలూరు,జనవరి26: పంచాయతీ ఎన్నికలను అడ్డుకునే వారికి సుప్రీంకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అని టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి అన్నారు. కొడవలూరులోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ తాము చెప్పిందే వినాలని మొండి వైఖరితో వున్న రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఓ గుణపాఠం నేర్పిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి. రాజేంద్రకుమార్, తువ్వర ప్రవీణ్కుమార్, పంది శ్రీనివాసులు, నాశన ప్రసాద్, చీపినాపి బాలకృష్ణ, గోపి, పి. శ్రీనివాసులు, నక్క రమణయ్య, నాగేశ్వరరావు, రాధా, సునీల్, తదితరులు పాల్గొన్నారు.