కార్యకర్తలకు అండగా ఉంటా : పల్లె

ABN , First Publish Date - 2022-08-14T05:11:56+05:30 IST

తెలుగుదేశం అభివృద్ధి కోసం పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడు తాను అండగా ఉంటానని, ఏ సమస్యలు వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు.

కార్యకర్తలకు అండగా ఉంటా : పల్లె
మైలసముద్రంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

కొత్తచెరువు (బుక్కపట్నం), ఆగస్టు 13 :  తెలుగుదేశం అభివృద్ధి కోసం పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడు తాను అండగా ఉంటానని, ఏ సమస్యలు వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగి ఇంటి వద్దనే ఉంటున్న  కొత్తచెరువు మండలం నారేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రామచంద్రను పల్లె శనివారం పరామర్శించారు. అనంతరం మైలసముద్రం గ్రామానికి వెళ్లి టీడీపీ కార్యకర్త రంగప్ప గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి సాలక్కగారి శ్రీనివాసులు, పట్టణ, మండల కన్వీనర్‌ ఒలిపి శ్రీనివాసులు, రామకృష్ణ, నియోజకవర్గ రైతుసంఘం అధ్యక్షుడు గాజుల చంద్రమోహన, బీసీ సెల్‌ అధ్యక్షుడు రాజులు పాల్గొన్నారు.

  పలువురికి పరామర్శ :  బుక్కపట్నంలో పలువురు టీడీపీ నాయకులను మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి పరామర్శించారు. టీడీపీ ఎస్సీసెల్‌ నాయకుడు పసల శ్రీరాములు,  మైనార్టీ నాయకుడు సయ్యద్‌బాషా ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పట్టణ కన్వీనర్‌ జంగం వెంకటరాముడు, నాయకులు వాజీద్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-14T05:11:56+05:30 IST