వీరజవాన్‌ కుటుంబాన్ని ఆదుకోండి...

ABN , First Publish Date - 2020-12-06T05:28:54+05:30 IST

ఇటీ వల మృతి చెందిన వజ్రపు కొత్తూరు గ్రామానికి చెందిన వీరజవాన్‌ బొంగు బాబురావు కుటుంబాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కోరినట్టు జనసేన నాయకులు డాక్టర్‌ దుర్గారావు తెలిపారు. హైదరా బాద్‌లో కేంద్రమంత్రిని కలసి ఈ మేరకు వినతి పత్రం అందించినట్టు చెప్పారు.

వీరజవాన్‌ కుటుంబాన్ని ఆదుకోండి...
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతి పత్రం అందిస్తున్న దుర్గారావు

వజ్రపుకొత్తూరు : ఇటీ వల మృతి చెందిన వజ్రపు కొత్తూరు గ్రామానికి చెందిన వీరజవాన్‌ బొంగు బాబురావు కుటుంబాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కోరినట్టు జనసేన నాయకులు డాక్టర్‌ దుర్గారావు తెలిపారు. హైదరా బాద్‌లో కేంద్రమంత్రిని కలసి ఈ మేరకు వినతి పత్రం అందించినట్టు చెప్పారు. అస్సాంరైఫిల్‌లో జవాన్‌గా విధులు నిర్వహించిన బాబురావు అరుణాచల్‌ప్రదేశ్‌లో తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, బాబురావు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్టు దుర్గారావు తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:28:54+05:30 IST