నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-08-04T06:19:22+05:30 IST
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డీవైఎ్ఫఐ జిల్లా అధ్యక్షుడు మూడావత్ రవినాయక్ అన్నారు.
మిర్యాలగూడలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న నాయకులు
డీవైఎ్ఫఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్
మిర్యాలగూడ, ఆగస్టు 3: ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డీవైఎ్ఫఐ జిల్లా అధ్యక్షుడు మూడావత్ రవినాయక్ అన్నారు. నిరుద్యోగుల మృతికి సంతాపం తెలుపుతూ మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే నిరుద్యోగులకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పతాని శ్రీను, వినోద్నాయక్, బాబునాయక్, నాగరాజు, రవి, శంకర్ పాల్గొన్నారు.
విద్య, వైద్యం అందని ద్రాక్షే : సీపీఎం
డిండి: విద్య, వైద్యం, ఉపాధి పేదలకు అందని ద్రాక్షగా మిగిలాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి ఐలయ్య అన్నారు. మండల కేంద్రంతోపాటు బొగ్గులదొన గ్రామంలో జరిగిన సీపీఎం మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో కంబాలపల్లి ఆనంద్, బూషిపాక వెంకటయ్య, బుచ్చయ్య, నిరంజన్, వెంకటయ్య, లూటమ్మ, జగతయ్య, బూషిపాక రాములు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.