నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటా
ABN , First Publish Date - 2022-10-02T05:30:00+05:30 IST
నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటా
మోమిన్పేట్, అక్టోబరు 2: నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి అండగా ఉంటానని మోమిన్పేట్ మండల సొసైటీ చైర్మన్ బండ విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామసభ నిర్వహించి పలు సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. టేకులపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మహేశ్ బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకునేందుకు గాను డబ్బులు అవసరం ఉండటంతో తన వంతు సాయంగా చైర్మన్ రూ.15వేలు అందించారు. గ్రామంలోని విద్యార్థులు బాగా చదువుతూ గ్రామానికి, పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం గాంధీ జయంతి సందర్బంగా మోమిన్పేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మోహన్రెడ్డి, శ్రీనివాస్, రవీందర్రెడ్డి, అంజయ్య, నర్సిములు, గోపాల్రెడ్డి, జాఫర్, వీరేశం, సుదర్శన్, ఉప సర్పంచ్ రైస్, పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య, వార్డు సభ్యులు పాష, రాజు, రాములు, సరిత, వీరమణి, వెంకటేశం, మనెయ్య, సుజాత, సర్పంచ్ అంగేరి శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి నర్సిములు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.