శ్రీగంధం సాగుకు సహకారం: సీఎస్‌ సోమేశ్‌

ABN , First Publish Date - 2021-03-02T08:34:27+05:30 IST

రాష్ట్రంలో శ్రీగంధం సాగుకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

శ్రీగంధం సాగుకు సహకారం: సీఎస్‌ సోమేశ్‌

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శ్రీగంధం సాగుకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బీఆర్కే భవన్‌లో కలిశారు. శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతివ్వాలని రైతులు సీఎ్‌సను కోరారు. రైతులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను ముఖ్యమంత్రికి వివరిస్తానని సీఎస్‌ వారికి భరోసా ఇచ్చారు.  శ్రీగంధం సాగు చేపట్టిన నల్లగొండ జిల్లాకు చెందిన పి.ఇస్తారపురెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన కె.రవీందర్‌రెడ్డిని సీఎస్‌ అభినందించారు.

Updated Date - 2021-03-02T08:34:27+05:30 IST