హిందూపురం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌పై వేటు

ABN , First Publish Date - 2021-05-11T06:27:07+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హిందూపురం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దివాకర్‌బాబుపై వేటు వేశారు. ఆయ న్ను మునుపటి శాఖకు బదిలీచేశారు. ఆయన స్థానంలో ఇనచార్జ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ జాన్లీ జోసె్‌ఫను ని యమించారు.

హిందూపురం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌పై వేటు

ఇనచార్జ్‌గా జాన్లీ జోసెఫ్‌

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌


అనంతపురం/హిందూపురం టౌన, మే10(ఆంధ్రజ్యోతి): కరోనా విపత్కర పరిస్థితుల్లో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హిందూపురం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దివాకర్‌బాబుపై వేటు వేశారు. ఆయ న్ను మునుపటి శాఖకు బదిలీచేశారు. ఆయన స్థానంలో ఇనచార్జ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ జాన్లీ జోసె్‌ఫను ని యమించారు. ఈ మేరకు కలెక్టర్‌ గంధం చంద్రుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇనచార్జ్‌గా వ్య వహరిస్తున్న డిప్యూటీ సివిల్‌ సర్జన దివాకర్‌బాబు వెంటనే జాన్లీజోసె్‌ఫకు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో ఆస్పత్రి నిర్వహణను మెరుగు పరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. డాక్టర్‌ జాన్లీజోసెఫ్‌ హిందూపురం ఆస్పత్రిలో సివి ల్‌ అసిస్టెంట్‌ సర్జన స్పెషలిస్టు (అనస్తీషియా)గా పనిచేస్తున్నారు. డాక్టర్‌ దివాకర్‌బాబును తిరిగి రొళ్ల మండలం క మ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో డిప్యూటీ సివిల్‌ సర్జనగా విధు లు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్‌ ఆదేశించారు.


Updated Date - 2021-05-11T06:27:07+05:30 IST