10 ఓవర్లలో సన్రైజర్స్ స్కోర్.. ఆర్సీబీకంటే ఎక్కువే..
ABN , First Publish Date - 2021-04-15T03:50:10+05:30 IST
ఆర్సీబీ-సన్రైజర్స్ మధ్యలో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ పట్టు బిగిస్తోంది. పది ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 7.70 రన్రేట్తో..
చెన్నై: ఆర్సీబీ-సన్రైజర్స్ మధ్యలో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ పట్టు బిగిస్తోంది. పది ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 7.70 రన్రేట్తో 77 పరుగులు చేసింది. క్రీజులో రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(38: 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే(30:27 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులు) క్రీజులో ఉన్నారు. ఇంకా 7.30 రన్రేట్తో 10 ఓవర్లలో సన్రైజర్స్ 73 పరుగులు చేయాల్సి ఉంది. కాగా.. ఈ సమయానికి ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి కేవలం 63 పరుగులు మాత్రమే చేసింది.