పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన హైదరాబాద్

ABN , First Publish Date - 2022-04-17T20:52:30+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన హైదరాబాద్

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు చెరో ఐదు మ్యాచులు ఆడి మూడింటిలో విజయం సాధించి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అయితే, రన్‌రేట్ పరంగా హైదరాబాద్ కంటే పంజాబ్ రెండు స్థానాలు పైనుంది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్ ఆ తర్వాత విజృంభించి వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి ఊపుమీదుంది.


మరోవైపు, పెద్దగా అంచనాలు లేని పంజాబ్ కింగ్స్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి.  దీంతో నేటి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, పంజాబ్‌ జట్టులో మాత్రం ఒక్క మార్పు చోటుచేసుకుంది. మయాంక్ అగర్వాల్ స్థానంలో ప్రభ్‌సిమ్రన్ జట్టులోకి వచ్చాడు. 

Updated Date - 2022-04-17T20:52:30+05:30 IST