ముగిసిన సుంకులమ్మ తిరునాల
ABN , First Publish Date - 2021-04-17T05:53:00+05:30 IST
మండలంలోని నాయకునిపల్లి గ్రామశివారులో వెలసిన సుంకులమ్మతల్లి తిరునాల శుక్రవారం ఘనంగా ముగిసింది.
పుట్లూరు, ఏప్రిల్ 16: మండలంలోని నాయకునిపల్లి గ్రామశివారులో వెలసిన సుంకులమ్మతల్లి తిరునాల శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారితోపాటు అభయాంజనేయస్వామికి ప్రత్యేకపూజ లు నిర్వహించారు. గాజుల అంగళ్లు, పిల్లల ఆటవస్తువుల దుకాణాలతో కి క్కిరిసిపోయాయి. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
మైలాపురంలో పెద్దమ్మ దేవతకు పూజలు
బొమ్మనహాళ్ : మండలంలోని మైలాపురం గ్రామంలో శుక్రవారం శాలివాహన వంశీకులు, కుమ్మరి కులస్తులు పెద్దమ్మదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామంలో కుంభాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ఆకుపూజ, ప్రత్యేక పుష్పాలంకరణ అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా చైత్రమాసంలో శాలివాహన కుటుంబీకుల ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తామని తెలిపారు.
బెళుగుప్ప: మండలంలోని తగ్గుపర్తిలో గ్రామస్థుల ఆరాధ్యదైవం, గ్రా మ దేవత తగ్గుపర్తమ్మకు శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అ భిషేకాలు, పుస్పాలంకరణతో అమ్మవారికి బోణాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.