ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడాలి: సుంకర పద్మశ్రీ
ABN , First Publish Date - 2020-08-15T19:25:45+05:30 IST
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి పోరాడాలని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ పేర్కొన్నారు.
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి పోరాడాలని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ఏపీ సీఎం జగన్ ‘ప్రత్యేక హోదా’ గురించి ప్రస్తావించడాన్ని కాంగ్రెసు పార్టీ స్వాగతిస్తోందన్నారు. ఏపీ సీఎం ‘ప్రత్యేక హోదాపై ప్రస్తావించడమే కాదు.. దానిని సాధించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాపై కేంద్రంతో సీఎం జగన్ పోరాడాలన్నారు. కేంద్రం ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. ఏపీ సీఎం జగన్ కుంటిసాకులు చెప్పడం భావ్యం కాదని సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు.