ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: పద్మశ్రీ
ABN , First Publish Date - 2021-05-11T14:35:06+05:30 IST
విజయవాడ: తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు 11 మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు
విజయవాడ: తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు 11 మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.