జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో జడ్పీచైర్పర్సన్
ABN , First Publish Date - 2020-11-24T05:30:00+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హఫీజ్పేట డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పూజితజగదీశ్వర్ తరపున జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
వికారాబాద్, (ఆంధ్రజ్యోతి) : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హఫీజ్పేట డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పూజితజగదీశ్వర్ తరపున జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఆమె పార్టీ నాయకులతో కలిసి కాలనీలు, బస్తీల్లో అభ్యర్థి పూజిత తరపున ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. హఫీజ్పేట డివిజన్ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ జి.నాగేందర్గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రచారంలో టీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్
ధారూరు: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం టీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జి కుమ్మరి శ్రీనివాస్ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి గాంధీనగర్, చిలుకానగర్ డివిజన్లలో పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి గీతాప్రసాద్ తరపున ఇంటింటి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అంజయ్య, సాయికుమార్, అంజయ్య పాల్గొన్నారు.
శివరాంపల్లిలో కొడంగల్ ఎమ్మెల్యే...
కొడంగల్ రూరల్ : రాజేంద్రనగర్ డివిజన్ పరిధి శివరాంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలతకు మద్దతుగా డివిజన్ఇన్చార్జీ, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి నాయకులు సైతం హైదరాబాద్ చేరుకుని ఎమ్మెల్యే వెంట ప్రచారంలో పాల్గొన్నారు. మధుసూదన్యాదవ్, అమ్జద్, సాయిలు, అజ్మీర్, రమేష్బాబు, నవాజ్ పాల్గొన్నారు