బాధితుల కుటుంబాలకు పరిటాల సునీత పరామర్శ

ABN , First Publish Date - 2021-06-20T06:33:44+05:30 IST

మండలంలోని పేరూరు, కొత్త గాదిగకుంట, చిన్న కొం డాపురం గ్రామా ల్లో వివిధ కా రణాలతో మృతిచెం దిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరిటాలసునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ శనివారం పరామర్శించారు.

బాధితుల కుటుంబాలకు పరిటాల సునీత పరామర్శ
మృతుల కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న మాజీ మంత్రిపరిటాలసునీత, పరిటాలశ్రీరామ్‌


రామగిరి, జూన 19: మండలంలోని పేరూరు, కొత్త గాదిగకుంట, చిన్న కొం డాపురం గ్రామా ల్లో వివిధ కా రణాలతో మృతిచెం దిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరిటాలసునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ శనివారం పరామర్శించారు. పేరూరులో అంగడిరాజు, సర్పంచ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన పోతన్న, ఆయన భార్య లక్ష్మీనరసమ్మ, పేరూరు కొత్తపల్లి తాళ్లపర్తి నాగిరెడ్డి, గౌనిశీనప్ప, ఉమర్‌ ఖాన, పేరూరు డ్యాంకు చెందిన వెంకటేశులు, వడి ్డసత్యమయ్య కుటుం బాలను పరామర్శించారు. అలాగే  చిన్నకొండాపురానికి చెందిన టీకే నాగ భూషణ, కొత్తగాదిగకుంట గ్రామానికి చెందిన నడిమింటి రామయ్య,  కుమ్మరిగోవిందు, కే తిప్పన్న, జే పోతక్క, ఎస్‌ పెద్దముత్యాలయ్య కుటుం బసభ్యులను పరామర్శించారు. ఏ సమస్య వచ్చిన్నా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీపీ రంగయ్య, మండల కన్వీనర్‌ సుబ్బరాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామ్మూర్తినాయుడు, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T06:33:44+05:30 IST