సన్నీకి ఘన సన్మానం
ABN , First Publish Date - 2021-03-07T09:41:53+05:30 IST
గవాస్కర్ టెస్ట్ అరంగేట్రం చేసి శనివారం నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీసీసీఐ సన్నీని ఘనంగా సన్మానించింది...
గవాస్కర్ టెస్ట్ అరంగేట్రం చేసి శనివారం నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీసీసీఐ సన్నీని ఘనంగా సన్మానించింది. భారత్-ఇంగ్లండ్ చివరి టెస్ట్ మూడోరోజు ఆట భోజన విరామంలో.. బోర్డు కార్యదర్శి జై షా.. 71 ఏళ్ల గవాస్కర్కు ప్రత్యేక టోపీని బహూకరించాడు. అలాగే క్రికెట్ ప్రపంచం యావత్తూ గవాస్కర్ను అభినందిస్తూ అతడి కెరీర్లోని అపురూప ఘట్టాలను మననం చేసుకుంది. 1971 మార్చి 6న పోర్ట్ ఆ్ఫ స్పెయిన్లో వెస్టిండీస్పై గవాస్కర్ తొలి టెస్ట్ ఆడాడు.