ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం
ABN , First Publish Date - 2022-07-01T06:11:32+05:30 IST
ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో 45 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం గురువారం ముగిసింది.
ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం
గవర్నర్పేట, జూన్ 30: ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో 45 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ జమలపూర్ణమ్మ చిన్నారులకు శిక్షణ ఇచ్చిన మాస్టర్లు మల్లిక్, శ్రీమన్నారాయణ, రవిబాబు, బొడ్డపాటి రాజు, కళాసాగర్, రాణి, శివనాగేశ్వరిలను శాలువా కప్పి, మెమొం టోలు అందించి సత్కరించారు. విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, పుస్తకాలు బహుమతులుగా అందిం చారు. లైబ్రేరియన్లు కె. నాగరాజు, కె. మధుసూదన రాజు, ఏ. రామచంద్రుడు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ జమలపూర్ణమ్మను ఘనంగా సత్కరించి మెమొంటో అందజేశారు.
సత్యనారాయణపురం: సత్యనారాయణపురం చిత్తరంజన్శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా శారదా జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ లుక్కా శ్రీధర్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులు తప్పని సరిగా పుస్తక పఠనం అలవరుచుకోవాలని చెప్పారు. అనంతరం క్యాంప్లో విద్యార్థులు పేపర్ ఆర్ట్స్తో తయారు చేసిన వస్తువులను తిలకించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విశ్రాంత లెక్చరర్ బి. సరస్వతి,గ్రంథాలయాధికారి పి.సంపత్ కుమార్, పాఠశాల విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.