పారాలింపిక్స్ విజేతలపై కనకవర్షం
ABN , First Publish Date - 2021-08-31T03:04:50+05:30 IST
చండీగఢ్: టోక్యో పారాలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులపై కనకవర్షం కురుస్తోంది. జావెలిన్ త్రో లో భారత్కు బంగారు పతకం తీసుకొచ్చిన సుమిత్ అంటిల్కు హర్యానా ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది.
చండీగఢ్: టోక్యో పారాలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులపై కనకవర్షం కురుస్తోంది. జావెలిన్ త్రో లో భారత్కు బంగారు పతకం తీసుకొచ్చిన సుమిత్ అంటిల్కు హర్యానా ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. అదే సమయంలో డిస్కస్ త్రోలో రజత పతకం సాధించిన యోగేశ్ కతునియాకు 4 కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు. ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్కు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.