పింఛన్‌దారులకు సేవలందిస్తున్న సుజాతకు పురస్కారం

ABN , First Publish Date - 2021-01-27T05:58:36+05:30 IST

వృద్ధు లైన పింఛన్‌దారులకు ఉత్తమ సేవలందించిన జిల్లా ఖజానా కార్యాలయ జూనియర్‌ అకౌంటెం ట్‌ జి.సుజాతకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అవార్డు అందజేశారు.

పింఛన్‌దారులకు సేవలందిస్తున్న సుజాతకు పురస్కారం
ప్రశంసాపత్రం అందుకుంటున్న సుజాత

ఒంగోలు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : వృద్ధు లైన పింఛన్‌దారులకు ఉత్తమ సేవలందించిన జిల్లా ఖజానా కార్యాలయ జూనియర్‌ అకౌంటెం ట్‌ జి.సుజాతకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌  అవార్డు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమెకు మంగళవారం ప్రశంసాపత్రం ఇచ్చారు. జిల్లాలో కదలలేని పరిస్థితుల్లో ఉన్న పింఛన్‌దా రుల ఇళ్లకు వెళ్లి లైవ్‌ సర్టిఫికెట్‌ తీసుకొని వస్తూ గత కొద్దికాలంగా ఆమె వందలాది మందికి సేవ లందిస్తున్నారు. ఆశాఖ ఉన్నతాధికారులు ఆమె పనితీరును గుర్తించి హైద రాబాద్‌, విజయవాడకు పంపి విశ్రాంత సీఎస్‌లు, ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్‌, ఏపీఎస్‌ల లైవ్‌ సర్టిఫికెట్లను ఈమె ద్వారా తీయించారు. అవార్డును అందుకున్న సుజాతను ఖజానా శాఖ డీడీ జగన్నాథరావుతోపాటు, ఆ శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాజకుమార్‌, జిల్లా అధ్య క్షుడు నారాయణరావు, నాయకులు ఖాదర్‌ తదితరులతోపాటు రాష్ట్ర ప్రభు త్వ పింఛనర్ల అసోసియేషన్‌ అమరావతి, గుంటూరు, ప్రకాశం జిల్లాల శాఖ ల నాయకులు పున్నయ్య, అంకిరెడ్డి, రామకృష్ణ, ఆల్‌ఫ్రెడ్‌ అభినందించారు.


Updated Date - 2021-01-27T05:58:36+05:30 IST