భవిష్యత్లో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది: సుజనా చౌదరి
ABN , First Publish Date - 2020-09-19T19:09:02+05:30 IST
ఢిల్లీ: దేశంలో తాగునీటి సరఫరా, డిమాండ్కు మధ్య వ్యత్యాసాన్ని... తగ్గించేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత సుజనాచౌదరి పేర్కొన్నారు.
ఢిల్లీ: దేశంలో తాగునీటి సరఫరా, డిమాండ్కు మధ్య వ్యత్యాసాన్ని... తగ్గించేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత సుజనాచౌదరి పేర్కొన్నారు. సమర్ధవంతమైన నీటి నిర్వహణ చర్యలు తీసుకోకపోతే... భవిష్యత్లో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దేశంలోని ఏ నగరంలోనూ 24గంటల నీటి సరఫరా చేసే పరిస్థితి లేదన్నారు. 182 పట్టణాల్లో మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. సమర్థ నీటి నిర్వహణ పద్ధతులు లేకపోవడం వల్ల... వర్షాకాలంలో నదుల నుంచి పెద్ద మొత్తంలో నీరు సముద్రం పాలవుతోందని సుజనా చౌదరి పేర్కొన్నారు.