అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు: సుజనా చౌదరి

ABN , First Publish Date - 2022-03-10T21:23:30+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.

అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు: సుజనా చౌదరి

అమరావతి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ సమర్ధ నాయకత్వంపై ప్రజల అచంచల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. 37 ఏళ్ల తరువాత యూపీలో వరుసగా రెండవ సారి ఒకే పార్టీ అధికారంలోకి రావడం గొప్ప విషయమన్నారు. ఆ ఘనత సీఎం యోగి ఆదిత్యనాధ్, ప్రధాని మోదీల సమర్థ పాలన ఫలితమేనన్నారు. కుల, వర్గ రాజకీయాలకు పాల్పడిన వారికి ఓటమి తప్పలేదన్నారు. భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి కారకులైన నేతలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా సుజనా చౌదరి అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-03-10T21:23:30+05:30 IST