మధుర దేవాలయం పక్కన ఈద్గాపై కోర్టులో దావా

ABN , First Publish Date - 2020-09-26T17:59:45+05:30 IST

మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న షాహి ఈద్గాను తొలగించాలని కోరుతూ...

మధుర దేవాలయం పక్కన ఈద్గాపై కోర్టులో దావా

మధుర (ఉత్తరప్రదేశ్): మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న షాహి ఈద్గాను తొలగించాలని కోరుతూ బాలదేవత భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరపున రంజనా అగ్రిహోత్రి మధుర సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ దావాలో యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, షాహిఈద్గా ట్రస్టు మేనేజ్ మెంట్ కమిటీలను ప్రతివాదులుగా పేర్కొంటూ లక్నోవాసి రంజనా అగ్నిహోత్రి పిటిషన్ వేశారు. ఆలయానికి 13.37 ఎకరాల భూమిని తిరిగి పొందాలని ట్రస్టు కోర్టులో వేసిన పిటిషనులో కోరింది. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, 1968లో ఈద్గా ట్రస్టు మేనేజ్ మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని దావాలో రంజనా ఆరోపించారు.

Updated Date - 2020-09-26T17:59:45+05:30 IST