అత్తింటి వేధింపులకు యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-26T07:24:44+05:30 IST
అత్తింటి వేధింపులు తాళలేక కూచిపూడి అగ్రహారానికి చెందిన పెనుమూడి దుర్గ నాగసుచరిత (22) ఆత్మహత్యకు పాల్పడింది.
కూచిపూడి : అత్తింటి వేధింపులు తాళలేక కూచిపూడి అగ్రహారానికి చెందిన పెనుమూడి దుర్గ నాగసుచరిత (22) ఆత్మహత్యకు పాల్పడింది. పెనుమూడి నాగ నరేంద్ర శర్మతో సుచరితకు 2018 ఏప్రియల్ 27న వివాహం జరిగింది. అధిక కట్నం కోసం భర్తతోపాటు అత్త పెనుమూడి విశాలాక్షి తరచూ వేధిం పులకు గురిచేస్తుండటంతో ఆదివారం సుచరిత బల వన్మరణానికి పాల్ప డింది. మృతురాలికి ఐదు నెలల ఆడపిల్ల ఉంది. మృతు రాలి తండ్రి భీమేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేయగా, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా దర్యాప్తు చేపట్టారు.